హైదరాబాద్, 28 ఫిబ్రవరి:
హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక నార్నేతో పాటు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేశారు.
ఇక వైసీపీలో చేరిన అనంతరం నార్నె మీడియాతో మాట్లాడుతూ.. తాను గత పదేళ్ల నుంచి వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నని, వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి టికెట్ ఆశించడం లేదని.. టికెట్ కోసం పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు.
ఇక నార్నె..వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం రాగానే.. ఎన్టీఆర్ కూడా జగన్ కి మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా దీనిపై నార్నె వివరణ ఇచ్చారు. తాను వైసీపీలో చేరడానికి.. తన అల్లుడు ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం అది తన వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పారు.
మామాట: అంతేగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుంది