అయితే ఇప్పటికే చేయబోయే తదుపరి చిత్రం ప్రారంభమైంది. సుకుమార్ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని అల్లు అర్జున్ చాలా కాలం కిందటే ప్రకటించాడు. అంతేకాదు అల్లు అర్జున్ లేకుండా ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్.
Also Read:
సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంత గ్రామానికి వెళ్లిన సుకుమార్ అక్కడి మీడియాతో మాట్లాడు. ఈ సందర్భంగా త్వరలోనే బన్నీ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపాడు. ఫిబ్రవరి తొలి వారంలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో బన్నీ కూడా షూటింగ్లో పాల్గొంటాడని క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీగా నిర్మిస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read:
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించింది. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్, రాధకృష్ణలు సంయుక్తంగా గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. సుశాంత్, నివేదాపేతురాజ్, టబు, జయరామ్, ఇతర కీలక పాత్రల్లో నటించారు.